కేంద్రమంత్రి పీయూష్‌ని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు…

184
piyush
- Advertisement -

కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ని కలిశారు టీఆర్ఎస్ ఎంపీలు. పార్లమెంట్‌లోని రాజ్యసభ లాబీలో కేంద్రమంత్రిని కలిశారు. కేశవరావు నేతృత్వంలోని ఎంపీల బృందం ధాన్యం సేకరణ అంశాన్ని ప్రస్తావించారు. అంతేగాదు ఈ అంశంతో చర్చించేందుకు తెలంగాణ నుండి మంత్రుల బృందం ఢిల్లీకి వచ్చారని తెలిపారు..

వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని గోయల్‌ని కోరారు కేశవరావు. దీనిపై స్పందించిన గోయల్…రేపు షెడ్యూల్ చూసుకుని సమయం ఇస్తానని తెలిపారు.

ముఖ్య‌మంత్రి కేసీ‌ఆర్‌ ఆదే‌శాల మేరకు ఢిల్లీ వెళ్లిన‌ ఈ బృందంలో నిరం‌జ‌న్‌‌రెడ్డి, గంగుల కమ‌లా‌కర్‌, వేముల ప్రశాం‌త్‌‌రెడ్డి, పువ్వాడ అజ‌య్‌‌కు‌మార్‌ ఉన్నారు. పీయూష్‌ గోయ‌ల్‌తో పాటు పలు‌వురు కేంద్ర మంత్రు‌లను కలిసి విన‌తి‌ప‌త్రాలు అంద‌జే‌య‌ను‌న్నారు.

- Advertisement -