సమాచార- ప్రసార వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఎంపీ సంతోష్..

256
mp santhosh
- Advertisement -

ఈ రోజు ఢిలీలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను వివిధ కమిటీలకు నామినేట్ చేసింది. ఇందులో భాగంగా సమాచార, ప్రసారాల వ్యవహారాల కమిటీ సభ్యులుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ నామినేట్‌ అయ్యారు. అలాగే పెట్రోలియం, నేచురల్ గ్యాస్ కమిటీ సభ్యులుగా టిఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు నియమితులయ్యారు.

పరిశ్రమలు మరియు వాణిజ్యం వ్యవహారాల కమిటీ సభ్యులుగా ఎంపీ బండ ప్రకాశ్ నామినేట్‌ అయ్యారు. అదేవిధంగా రక్షణ వ్యవహారాల కమిటీ సభ్యులుగా కెప్టెన్ లక్ష్మీ కాంతారావు..ట్రాన్స్ పోర్ట్, హైవేస్, షిప్పింగ్ వ్యవహారాల కమిటీ సభ్యులుగా బడుగుల లింగయ్య యాదవ్ నియమితులయ్యారు.

- Advertisement -