ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: కవిత

240
TRS MP Kavitha
- Advertisement -

నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌ పార్టీ నేతలకు సవాల్‌ విసిరారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని, లీగల్‌ గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు టీఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీ నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయల నిథుల కంటే తక్కువ కేటాయించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం..లేకపోతే కాంగ్రెస్‌ పార్టీ నేతలు తీసుకుంటారా అని సవాల్‌ చేశారు.

TRS MP Kavitha

నిజామాబాద్‌ గురువారం విలేకరులతో మాట్లాడిన కవిత ..ముందస్తు ఎన్నికలకు పోతున్నామని తనకు తెలియదని, కానీ…ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం సిద్దమని వ్యాఖ్యానించారు. ప్రజలు మాకు 100 శాతం మార్కులు వేశారని, వచ్చేఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌కు ఇవే ఫలితాలు వస్తాయని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ ఏం చేసినా ప్రతిపక్షాలకు భయమే..వాళ్ల ఆలోచన ప్రజలు కాదు పవర్‌ అని అన్నారు. అయితే కొంగర కలాన్‌ సభకు ఆర్టీసీ బస్సులను అద్దెకు మాత్రమే తీసుకుంటున్నామని, ఉద్దరకు తీసుకోవడంలేదని అన్నారు. దీనిపై కూడా విపక్షాలు కోర్టుకు వెళ్తే వారికే మొట్టికాయలు పడతాయని చెప్పారు. జోనల్‌ వ్యవస్థతో పరిపాలనాసౌలభ్యం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం జోనల్‌ వ్యవస్థ ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -