ప్రమాణస్వీకారం చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు..

162
- Advertisement -

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఐదుగురు టీఆర్‌ఎస్‌ సభ్యులు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పీ వెంకట్రామిరెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వారితో శాసన మండలిలోని తన చాంబర్‌లో శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి ప్రమాణం చేయించారు. కాగా, రాజ్యసభ సమావేశాల దృష్ట్యా బండా ప్రకాశ్‌ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే కోటాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తమకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -