సైదిరెడ్డి పక్కా లోకల్ః ఎమ్మెల్సీ పల్లా

402
palla Saidireddy
- Advertisement -

హుజుర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి పక్కా లోకల్ అన్నారు ఎమ్మెల్సీ,, హుజుర్ నగర్ టీఆర్ఎస్ ఉప ఎన్నికల ఇంఛార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఆయన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హుజుర్ నగర్ ప్రజల అదృష్టం కోసమే ఈ ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను కేంద్రమంత్రి అవుతానని నల్లగొండ ప్రజలను మోసం చేసి ఉత్తమ్ ఎంపీగా గెలిచారని చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ మాయమాటలు ఎవరు నమ్మరు.

స్థానికుడు, యువకుడు, ఉత్సాహవంతుడు సైదిరెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయం అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతి దే నాన్ లోకల్.. ఎక్కడ జన్మించారో కూడా హుజుర్ నగర్ ప్రజలకు తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ లో పేకాట క్లబ్ లను, ఇసుక మాఫియాను పెంచి పోషించి, భ్రష్టు పట్టించాడన్నారు.

- Advertisement -