టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు ఏపీలో సన్మానం..

252
trs mlas
- Advertisement -

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు ఘన సన్మానం జరిగింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో ఆదివారం మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ యాదవ ఎమ్మెల్యేలకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంగా యాదవులు అన్నిరంగాల్లో ముందుండాలని తెరాస ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్‌(కోదాడ), నోముల నర్సింహయ్య యాదవ్‌(నాగార్జునసాగర్‌), అంజయ్యయాదవ్‌(షాద్‌నగర్‌) అన్నారు.

తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో ప్రముఖ నేతలను ఓడించిన ఘనత యాదవులకే దక్కుతుందన్నారు. ఏ పార్టీలో అవకాశం వచ్చినా యాదవులను గెలిపించేలా గ్రామగ్రామాన ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపు ఇచ్చారు.

ప్రభుత్వాలను శాసించే సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఐక్యంగా లేకపోవడం వల్లనే యాదవులు పదవులు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేల ఆత్మీయ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన యాదవ సామాజికవర్గ నేతలు హాజరయ్యారు.

- Advertisement -