పోచారంను పరామర్శించిన టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు..

238
trs mlas pocharam
- Advertisement -

మాతృవియోగంతో దుఃఖంలో ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని పరామర్శించారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు. పాపవ్వ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

పోచారంను పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, సి. లక్ష్మారెడ్డి, ఈటెల రాజేందర్, రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్,ఎమ్మెల్యేలు జి. అంజయ్య, (షాద్ నగర్), చెన్నమనేని రమేశ్ (వేములవాడ), ఎర్రబెల్లి దయాకర్ రావు (పాలకుర్తి), ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), మాగంటి గోపినాద్ (జూబ్లీహిల్స్), చల్లా ధర్మారెడ్డి (పరకాల), అరికపూడి గాందీ (శేరిలింగంపల్లి), చంటి క్రాంతి కిరణ్ (ఆందోల్) ఉన్నారు.

మాజీ స్పీకర్ కె.ఆర్ సురేష్ రెడ్డి, MLC నారదాసు లక్ష్మణ్ రావు, కరీంనగర్ ZP చైర్మన్ తుల ఉమ, SC , ST కమీషన్ చైర్మెన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్, మాజి శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి పరామర్శించారు.

నిన్న సీఎం కేసీఆర్ పోచారం కుటుంబ సభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే.కేసీఆర్‌తో పాటు ఎంపీ కవిత, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, గణేశ్‌ గుప్తా ఉన్నారు.

 

trs trs mlas trs mlas pocharam pocharam trs mlas pocharam

- Advertisement -