50వేల మెజార్టీతో గెలుస్తాః దానం నాగేంద‌ర్

265
danam nagendar
- Advertisement -

ఖైర‌తాబాద్ లో తాను సుమారు 50వేల మెజార్టీతో గెలుస్తాన‌ని స్ప‌ష్టం చేశారు  టీఆర్ఎస్ అభ్య‌ర్ధి దానం నాగేంద‌ర్. ఖైర‌తాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్దిగా ఆయ‌న ఇవాళ నామినేష‌న్ వేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ది, సంక్షేమ ప‌థ‌కాలే త‌మ‌ను గెలిపిస్తాయ‌న్నారు. మ‌రోసారి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రావ‌డం ఖాయ‌మ‌న్నారు.

danam

టీఆర్ఎస్ లో అసమ్మతి లేదని, ఎన్నికల బరిలో టీఆర్ఎస్ రెబెల్స్ ఉండరని చెప్పారు. ఎన్నికల్లో తాను డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని… గెలవడానికి కేసీఆర్ పథకాలు, తన ఓటు బ్యాంకు చాలని అన్నారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కూడా త‌న‌కే మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో పూర్తిస్ధాయిలో అభివృద్ది జ‌ర‌గాలంటే మ‌రోసారి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రావాల‌న్నారు.

- Advertisement -