పల్లె ప్రగతికి ప్రజాప్రతినిధుల కృషి..

68
Palle Pragathi
- Advertisement -

5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్ పెట్ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో స్పీకర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ మేరకు వారు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దఫెదార్ శోభ, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, సర్పంచ్ లు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు దేశాయ్ పేట గ్రామ పల్లె ప్రగతి లో పాల్గొన్నారు.

- Advertisement -