ఈనెల 20న టీఆర్‌ఎస్‌ శ్రేణులతో సమావేశం..

65
minister talasani
- Advertisement -

ఈ నెల 20వ తేదీన ఉదయం 11.00 గంటలకు తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ జిల్లాస్థాయి టీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అద్యక్షులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 27వ తేదీన టీఆర్ఎస్‌ పార్టీ 21వ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని ప్రాంతాలలో ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జిలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులు పాల్గొంటారని వారు తెలిపారు.

- Advertisement -