గ్రేటర్‌లో నిత్యావసర సరుకులు పంపిణీ..

215
trs
- Advertisement -

టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 వ వార్డ్ కండ్లకోయ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా ఆధ్వర్యంలో కరోనా లాక్ డౌన్ కారణం నిరాశ్రయులైన వలస కార్మికులకు మరియు పేద ప్రజలకు దాదాపుగా 500 మందికి సరిపడా నిత్యావసర సరుకులును వీరి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ పద్మ రెడ్డి, కౌన్సిలర్లు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ముషీరాబాద్ డివిజన్ వెస్ట్ఎం సి హెచ్ కాలనీ పార్సిగుట్ట లో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే ముఠా గోపాల్. కరోనా వైరస్ నివారణ , లాక్ డౌన్ అమలు సందర్భంగా తెరాస సీనియర్ నాయకుడు సోమసుందరం ఆధ్వర్యంలో జి హెచ్ ఎం సి పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులను అందశారు.ఈ కార్యక్రమంలో ముఠా జై సింహ, సునీల్, రాజేందర్, గోవింద్, రాకేష్ కుమార్, శ్రీధర్ రెడ్డి, సాయి చాణిక్య రెడ్డి, సత్యనారాయణ బాబు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -