పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత- ఎల్ రమణ

168
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ ఎం.ఎల్.ఏ క్వాటర్స్‌లో మొక్కలు నాటారు టి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎల్.రమణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరు తమ తమ పుట్టినరోజు పురస్కరించుకుని పర్యావరణానికి మేలు కలిగించే ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి పుట్టినరోజు జరుపుకోవాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా విజయవంతంగా కొనసాగుతుందని.. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు ఎల్.రమణ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ ఎల్ రమణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తను విసిరిని ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటినందుకు ఆయనకు ఎంపీ సంతోష్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -