రైతు సంక్షేమమే టీఆర్ఎస్‌ ధ్యేయం: మంత్రి హరీష్ రావు

178
harish rao
- Advertisement -

దేశంలో రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు మంత్రి హరీష్ రావు. సంగరెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేసిన అనంతరం మాట్లాడిన హరీష్… రైతులను సంఘటితం చేయడానికే ఈ రైతు వేదికలు అన్నారు.

కరోనా లాంటి సమయంలో కూడా రైతులకు ఇబ్బంది కాకుండా చూశామన్నారు. పూర్తి స్థాయిలో మద్దత్తు ధర ఇచ్చి రైతులను అదుకున్నామని…24 గంటలు కరెంట్ అందిస్తూ రైతులకు యూరియా కొరత రాకుండా చూసుకున్నాం అన్నారు.

గత ప్రభుత్వంలో రైతులు అంటే యూరియా కోసం లాఠి దెబ్బలు, కరెంట్ కోసం ఎదురుచూసి ఆత్మహత్యలు చేసుకున్నారని…కేంద్రం కూడా ఇతర ప్రాంతాల నుండి దిగుబడులను తగ్గించి స్వదేశీ పంటను పెంచేలా ప్రొత్సహించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సంగారెడ్డి జిల్లాలో మునిపల్లి మండలం తెలంగాణకే ఆదర్శంగా ఉండాలన్నారు.

- Advertisement -