టీఆర్ఎస్ ప్లీనరీ…ట్రాఫిక్ ఆంక్షలు

107
trs
- Advertisement -

ఈనెల 27న టీఆర్ఎస్ ప్లీనరీ జరగనున్న సంగతి తెలిసిందే. మాదాపూర్ హెచ్ఐసీసీ వేదికగా జరిగే ఈ ప్లీనరీ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్‌, సైబర్‌ టవర్స్‌-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్‌ టూ కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు వారి సమయ వేళలను మార్చుకోవాలని అధికారులు సూచించారు.

ఉద‌యం 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 4 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ర‌ద్దీ ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని, ఈ స‌మయాల్లో ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు.

ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాలు..

()నీరూస్‌ జంక్షన్‌-సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌-మెటల్‌ చార్మినార్‌ జంక్షన్‌-గూగుల్‌(సీఐఐ) జంక్షన్‌-కొత్తగూడ జంక్షన్‌ రోడ్డు.
()మెటల్‌ చార్మినార్‌ జంక్షన్‌-ఖానామెట్‌ జంక్షన్‌-హైటెక్స్‌/హెఐసీసీ/ఎన్‌ఏసీ రోడ్డు.
()జేఎన్‌టీయూ-సైబర్‌ టవర్స్‌ -బయోడైవర్సిటీ జంక్షన్‌.
()గచ్చిబౌలి జంక్షన్‌-బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌- కొత్తగూడ జంక్షన్‌-కొండాపూర్‌ జంక్షన్లు.

- Advertisement -