హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ ప్రభంజనం..

479
trs
- Advertisement -

హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ప్రచారం ఉపందుకుంది. ప్రచారంలో గులాబీ సైన్యం ముందుకు దూసుకుపోతుంది. ఈ రోజు ఉప ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి హుజూర్‌నగర్‌ పట్టణంలోని పలు వర్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Palla Rajeshwar Reddy

ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడికి వెళ్లినా గులాబీ పార్టీని ప్రజలు అక్కున చేరుకుంటున్నరు. హుజూర్‌నగర్‌లో గులాబీ పార్టీ ప్రభంజనం కనిపిస్తున్నది. బీజేపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నరని రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు.

ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటమి భయంతో,బీజేపీని అడ్డం పెట్టుకొని వెన్నుముక లేని రాజకీయాలు చేస్తున్నడు. హుజూర్‌నగర్‌ ప్రజల బాగు కోసం వచ్చిన ఈ ఎన్నికలో ప్రజలు చాలా చైతన్య వంతంగా ఆలోచిస్తున్నరని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -