నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావం:కేటీఆర్

261
ktr trs
- Advertisement -

ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరపాలని పిలుపునిచ్చారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు నిర్వహిస్తారు. వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్‌ సూచించారు.

2001 ఏప్రిల్‌ 27 టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించింది. 13 ఏళ్ల ఉద్యమ ప్రస్ధానంలో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చింది. నాడు ఉద్యమ పార్టీగా నేడు రాజకీయ పార్టీగా బంగారు తెలంగాణ సాధనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకుసాగుతోంది.

- Advertisement -