మాటల మాంత్రికుడిగా.. విలక్షణ దర్శకత్వ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగులకు విజిల్స్ వేయని వారుండరు. ఇక త్రివిక్రమ్ – సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి రాకముందు నుండే వీరిద్దరు మంచి ఫ్రెండ్స్. ఒకే రూమ్లో ఉంటూ ఇండస్ట్రీ కెరీర్ స్టార్ట్ చేయగా ఒకరు టాప్ దర్శకుడిగా మరొకరూ కమెడీయన్గా సెట్ అయి పోయారు.
ఇక త్రివిక్రమ్ దర్శకుడిగా తొలిసినిమా నువ్వే నువ్వే. సినిమా విడుదలై 20 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. సినిమా షూటింగ్ సమయంలో ప్రకాష్ రాజ్ ఫ్రిజ్ నుండి మద్యం బాటిళ్లను దోంగలించారు త్రివిక్రమ్ – సునీల్. ఈ విషయాన్ని వారే స్వయంగా వెల్లడించారు.
నువ్వే నువ్వే రెమ్యూనరేషన్తో బైక్ కొన్నాను అని త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించారు. ప్రకాష్రాజ్తో పనిచేయడం బాగా నచ్చిందని తెలిపారు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఆ రోజుల్లో నేను సునీల్ లక్డీకపూల్ లో ఒక రూమ్ లో కలిసి అద్దెకు ఉండేవాళ్లమని.. రూంకు అద్దె చెల్లించడానికి డబ్బు కట్టకపోవడంతో రూమ్ ఖాళీ చేయమని ఓనర్ చెప్పారని.. అప్పుడు నా జేబులో కేవలం రూ.28 మాత్రమ ఉన్నాయని ఆనాటి కష్టాలను గుర్తు చేసుకున్నారు.