త్రివిక్రమ్, బన్నీ కాంబో మరోసారి..

95
- Advertisement -

టాలీవుడ్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ‘జులాయి’ సినిమాతో మొదటిసారి కలిసిన వీరు.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో మరో విజయం అందుకున్నారు. అలానే గతేడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్షేషనల్ హిట్‌తో రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో సూపర్ హిట్ కాంబోలో నాలుగో సినిమా రాబోతోందని సమాచారం.

త్వరలో ఇదే కాంబినేషన్‌లో మళ్ళీ ఓ భారీ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ రానుందని టీమ్ వెల్లడించింది. ఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ కలిసి ఉన్న ఓ పిక్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. దీని ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది డిసెంబర్ 17న 5 భాషలలో రిలీజ్ కానుంది.

- Advertisement -