నాని ఎంట్రీతో హీట్‌ పెంచేశాడు….!

206
Tri war in Tollywood...!
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో శరవేగంగా తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ తొలుత ప్లాన్ చేసింది. అయితే బాబాయ్ పవన్‌ కోసం తన సినిమాను సంక్రాంతి కంటే ముందుగానే డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే, ఇప్పటివరకు బాగానే ఉన్న ఓ వైపు అఖిల్‌ మరోవైపు నాని కూడా డిసెంబర్‌లోనే వస్తుండటంతో టాలీవుడ్‌లో  హీట్‌ని పెంచేసింది.

నేను లోకల్, నిన్ను కోరి  వంటి చిత్రాలతో మంచి జోష్‌ మీదున్న నాని  ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’గా  డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నానికి జోడీగా ‘ఫిదా’ ఫేమ్ సాయి పల్లవి నటిస్తుండటంతో వారిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి కూడా సినిమా హైప్ ను పెంచేస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఇక తొలి సినిమాతో అంతగా ఆకట్టుకోని అక్కినేని అఖిల్ రెండోసినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. భారీ బడ్జెట్‌తో  తెరకెక్కుతున్న  ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు నాగార్జున. ఈ నేపథ్యంలో రాంచరణ్‌ సైతం ‘రంగస్థలం 1985’ని డిసెంబర్‌లో తీసుకురానుండటంతో టాలీవుడ్‌లో త్రిముఖ పోరు నెలకొంది.

ఓ వైపు దిల్ రాజు సెంటిమెంట్,విక్రమ్ కుమార్‌పై నాగ్ ఆశలు, మరోవైపు చెర్రీ-సుకుమార్ కాంబినేషన్ సినిమా ఒకే నెలలో విడుదల కానుండటం టీ టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ త్రిముఖ పోరులో పై చేయి సాధించేంది ఎవరో తెలియాలంటే వేచిచూడక తప్పదు.

- Advertisement -