31 వరకు రైళ్ల రద్దు..

120
railways
- Advertisement -

South central railway trains cancelled: దేశంలో రోజు రోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. ఒమిక్రాన్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇటీవలె ప్రకటించింది. కాగా 55 రైళ్ల రద్దును ఈనెల 31 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.

South central railway trains cancelled: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పలు ఫ్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు 55 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే… ఈ రద్దును ఈనెల 31వ వరకు పొడగించినట్లు తాజాగా వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించింది.

రద్దు చేసిన ప్రధాన రైళ్లు ఇవే..

కాజీపేట-సికింద్రాబాద్, కాచిగూడ-నడికుడ ప్యాసింజర్‌ రైళ్లు

కాచిగూడ-కర్నూల్ సిటీ, మేడ్చల్‌-ఉందానగర్ రైళ్లు రద్దు

మేడ్చల్ -సికింద్రాబాద్, సికింద్రాబాద్-ఉందానగర్ రైళ్లు రద్దు

తిరుపతి-కట్‌పడి, గుంతకల్-డోన్, కర్నూల్ సిటీ-గుంతకల్లు రైళ్లు రద్దు

రేపల్లె-తెనాలి, విజయవాడ-నర్సాపూర్ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

మచిలీపట్నం-విజయవాడ, మచిలీపట్నం-గుడివాడ రైళ్లు రద్దు

నర్సాపూర్-నిడుదవోలు ప్యాసింజర్ రైలు రద్దు

ఎంఎంటీఎస్‌లు రద్దు

ఎంఎంటీఎస్‌ సర్వీసుల రద్దు కొనసాగుతోంది. ఈ నెల 23 వరకూ 38 సర్వీసులను రద్దు చేసిన ద.మ. రైల్వే.. 24వ తేదీ కూడా 36 సర్వీసులను నిలిపేసినట్లు ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌ – లింగంపల్లి మధ్య నడిచే 18, ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య నడిచే 16, సికింద్రాబాద్‌ – లింగంపల్లి మధ్య నడిచే రెండు ఎంఎంటీఎస్‌లు ఉన్నాయి.

- Advertisement -