- Advertisement -
తెలంగాణ ఉద్యమకారులకు మరోసారి పట్టం కట్టారు. తెలంగాణ సీఎం బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు కేసీఆర్ ఉద్యమబిడ్డ అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా నియమించారు. రెండేళ్ల పదవికాలానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు.
కరీంనగర్ ముద్దుబిడ్డగా తెలంగాణ ఉద్యమకారునిగా ఉస్మానియా యూనివర్సిటీలో మలిదశ ఉద్యమంలో పాల్గొన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తండ్రి గెల్లు మల్లయ్య అఖిల భారత యాదవ మహాసభ కన్వీనర్ (2000-2005)గా, కొండపాక ఎంపీటీసీ (2001-2005)గా టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గా పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీ లో మండల స్థాయి లో 2004 నుండి నేటి వరకు పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి…
JAGAN:జగన్ సైలెంట్.. ఆ భయంవల్లేనా ?
MODI:మోడీ ఫేక్ డిగ్రీ.. నిజమేనా ?
KTR:తెలంగాణలో కూడా మున్నాభాయ్ ఎంబీబీఎస్..!
- Advertisement -