తెలంగాణకు భారత్‌ జోడో యాత్ర

370
- Advertisement -

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర ఆదివారం నుంచి తెలంగాణలో ప్రారంభమవుతుంది. కర్నాటకలోని రాయచూర్‌ నుండి 23వ తేదీ ఉదయం 10గంటలకు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా గూడబెల్లూర్‌లో ప్రారంభంకానున్న వేళ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏర్పాట్ల పర్యవేక్షణ చేస్తున్నారు.

రేపు ఉదయం నుంచి రాయచూర్‌ నుంచి కృష్ణ నది బ్రిడ్జి మీదుగా తెలంగాణలో అడుగుపెట్టనున్న రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్రను టీపీసీసీ రేవంత్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు. తెలంగాణలో ప్రారంభంకానున్న వేళ రాహుల్‌తో రేవంత్‌రెడ్డి రోడ్‌ మ్యాప్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

- Advertisement -