రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు.. గ్రామాల్లో టెన్షన్ వాతావరణం

403
Counting
- Advertisement -

రేపు తెలంగాణలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎప్పుడెప్పుడు ఫలితాలు వెలువడుతాయా అని వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభ్యర్దులు. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక రేపటి కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఓట్ల లెక్కింపును పూర్తయ్యేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది.

సుమారు 34వేల మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటారు. జులై 3న ఎంపీటీసీ, జులై 4న జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఇక ఈనెల 8న ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ను ఏర్పాటు చేశారు అధికారులు.

- Advertisement -