నేడే ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

20
edcet
- Advertisement -

ఆగస్టు 26వ తేదీన టీఎస్ ఎడ్‌సెట్‌-2022 ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఎడ్‌సెట్ ఫ‌లితాల‌ను సాయంత్రం 4:30 గంట‌ల‌కు రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి విడుద‌ల చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వైస్ చైర్మ‌న్ వీ వెంక‌ట ర‌మ‌ణ‌, ఉస్మానియా యూనివ‌ర్సిటీ వీసీ ప్రొఫెస‌ర్ డీ ర‌వీంద‌ర్ పాల్గొన‌నున్నారు. టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్ష జులై 26న జరిగిన విషయం తెలిసిందే. పరీక్షకు 38,091 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా 31,578 మంది హాజరయ్యారు. ఫ‌లితాల కోసం edcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

- Advertisement -