రేపటి నుంచి వరద ముంపు ప్రాంతాల్లో : సీఎం ఏరియల్‌ సర్వే

60
kcr aerial
- Advertisement -


నేటి సాయంత్రం వరంగల్ కు చేరుకున్న తర్వాత సీఎం కేసీఆర్ వరద పరిస్థితులపై వరంగల్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు ఎస్.మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య తదితర శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.

ఆదివారం ఉదయం వరంగల్ నుంచి భద్రాచలం దాకా హెలీకాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. భద్రాచలంలో పర్యటించి, వరద ముంపు వల్ల సంభవించిన నష్టం, చేపడుతున్న వరద సహాయక చర్యలపై స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష చేయనున్నారు. తగు ఆదేశాలు జారీ చేయనున్నారు. అక్కడినుంచి ఏటూరునాగారం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టి, అక్కడ కూడా దిగి, వరద సహాయక చర్యలపై సమీక్షించనున్నారు. తెల్లారి సోమవారం ఉత్తర తెలంగాణలోని ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం, తదితర వరద బాధిత ప్రాంతాలలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో భాగంగా సీఎం కేసీఆర్ వరద బాధితులను పరామర్శించి, వారికి భరోసా ఇవ్వనున్నారు.

- Advertisement -