రేపు ఉద‌యం యాదాద్రికి సీఎం కేసీఆర్

252
kcr visits yadardri Temple
- Advertisement -

సీఎం కేసీఆర్ రేపు ఉద‌యం యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహాస్వామి ఆల‌య‌న్ని ద‌ర్శించుకోనున్నారు. అనంత‌రం అక్క‌డ జ‌రుగుతున్న అభివృద్ది ప‌నుల‌ను స‌మీక్షించ‌నున్నారు. కొండపైన జరుగుతున్న ఆలయ విస్తరణ పనులను పరిశీలించనున్నారు. ఇప్పటికే చాలాసార్లు యాదాద్రికి విచ్చేసి అభివృద్ధి పనులను సమీక్షించిన ముఖ్యమంత్రి మరోసారి ఆలయ పనులపై దిశానిర్దేశం చేయనున్నారు.

CM KCR visits Yadadri Temple

తెలంగాణ తిరుప‌తిగా యాదాద్రిని తీర్చేదిద్దే దిశ‌గా అభివృద్ది ప‌నులు చేప‌డుతున్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. తూర్పు, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, పశ్చిమ దివ్యవిమాన గోపురం, స్వాగత గోపురం, రాజగోపురాల నిర్మాణ పనులు శిల్పకళా వైభవంతో విరాజిల్లుతున్నాయి. ఆర్కిటెక్ట్ ఆనంద సాయి, ఈఎన్సీ రవీందర్‌రావు, స్థపతులు ఎస్ సుందరరాజన్, డాక్టర్ ఆనందాచారివేలు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -