ఫస్ట్ లుక్‌పై హీరోల క్రేజ్‌

199
Tollywood Stars Crazy about First Look Posters
- Advertisement -

సోషల్ మీడియా ప్రపంచమంతా ఇప్పుడు ఇదే జపం చేస్తోంది.వీవీఐపీల దగ్గరి నుంచి కామన్ మ్యాన్ వరకు అంతా ఇప్పుడు సోషల్ మీడియానే పాలో అవుతున్నారు.  ముఖ్యంగా టాలీవుడ్ హీరోలకు సోషల్ మీడియా బ్రహ్మాస్త్రంలా మారిపోయింది. గతంలో   తమ  అనుభవాలను పంచుకోవాలంటే.. ఏదైనా గొడవ పై మాట్లాడాలంటే మీడియాను ఆశ్రయించేవారు.. కానీ సోషల్ మీడియా వచ్చాక మీడియా ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. ఎప్పటికప్పుడు తమ సినిమాకు సంబంధించిన లేదా ప్రస్తుత సినీ,రాజకీయాలపై వెంటవెంటనే స్పందిస్తూ ఫ్యాన్స్‌కు మరింత చేరువవుతున్నారు.

సినిమా షూటింగ్ దగ్గరి నుంచి ఫస్ట్ లుక్, టీజర్,సినిమా విడుదల తేదీ వరకు అంతా సోషల్ మీడియా వేదికగానే అనౌన్స్ చేసేస్తున్నారు. సోషల్ మీడియా లో తమ పోస్టులకు వస్తున్న రెస్పాన్స్ కి ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్రహీరోలంతా తమ సినిమాల ఫస్ట్‌ లుక్‌,టీజర్‌పై ఎక్కువదృష్టి సారిస్తున్నారు.

సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడులతో అభిమానులను ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయిన పవన్‌…తాజాగా త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు.వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు అజ్ఞాతవాసి టైటిల్ ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతుండగా చిత్రయూనిట్ ఇటీవలె ఒక పాటను విడుదల చేసింది.  కేవలం 10 గంటల వ్యవధిలోనే 1 మిలియన్ హిట్స్ వచ్చాయంటే అభిమానులు ఎంత ఆసక్తిగా విన్నారో అర్ధమైపోతుంది.

ఇదే కోవలో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెంచుతున్నారు బన్నీ అండ్ మహేష్ బాబు. డి జె సినిమా తో కొంచెం వెనుకబడిన అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాని చాల ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో చాల కేర్ తీసుకుంటున్నాడట. అలానే మహేష్ బాబు కూడా స్పైడర్ సినిమా టాక్ తో కొంచెం అలెర్ట్ అయ్యి కొరటాల శివ సినిమా విషయంలో ఫస్ట్ లుక్ నుండే జాగ్రత్త పడుతున్నాడట.

రామ్ చరణ్-సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘రంగస్థలం 1985’.రంగస్థలం మూవీ కాన్సెప్ట్ ను రివీల్ చేయకుండానే.. అద్భుతమైన టీజర్ ఇవ్వాలని.. ఆ తర్వాతే థియేట్రికల్ బిజినెస్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట సుకుమార్. మొత్తంగా ఫస్ట్ లుక్‌తోనే తమ సినిమాలపై అంచనాలు పెంచే విధంగా అగ్రహీరోలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- Advertisement -