వీరజవాన్లకు టాలీవుడ్ సెల్యూట్…

452
colnel santhosh
- Advertisement -

లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో భార‌త్‌- చైనా జవాన్లు పరస్పరం దాడులు చేసుకోవటంతో 20మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

దేశం కోసం ప్రాణాలు విడిచిన అమ‌ర‌వీరుల ఆత్మ‌కి శాంతి క‌లగాల‌ని త‌మ‌న్నా, దేవి శ్రీ ప్ర‌సాద్, మంచు విష్ణు, అనీల్ రావిపూడి,నిఖిల్, వ‌రుణ్ తేజ్‌, ల‌క్ష్మీ మంచు వీర‌జవాన్లకి ఘ‌న నివాళులు అర్పించారు.

గాల్వాన్‌ లోయలో సోమవారం ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనగా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉంది.

- Advertisement -