ఆత్మ‌హత్య‌య‌త్నంపై స్పందించిన టాలీవుడ్ డైరెక్ట‌ర్ రాజ‌సింహా..

222
tollywood director rajasimha as clarity to comitted suside yesterday..
- Advertisement -

 సినీ ర‌చ‌యిత, డైరెక్ట‌ర్ రాజ‌సింహ ఆత్మ‌హ‌త్యయ‌త్నం చేసుకున్నాడ‌నే వార్త నిన్న హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ముంబ‌య్ లో ఫ్యామిలితో ఉన్న ఆయ‌న.. ఈ విష‌యంపై త‌న స్నేహితులు ఆరా తీయ‌గా ఆయన స్పందించారు. నేను ఆత్మ‌హ‌త్య చేసుకొలేద‌ని ఆయ‌న తెలిపారు. నాకు జ‌రిగింది ఒక‌టైతే మీడియాలో మ‌రో వార్త వ‌చ్చింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఈ వార్త విన‌గానే త‌న‌కు చాలా బాధ‌వేసింద‌న్నారు. నాకు మ‌ధుమేహ వ్యాధి ఉంద‌ని, ఘ‌గ‌ర్ లెవ‌ల్స్ ఎక్కువ‌వ‌డంతో అప‌స్మార‌క స్దితిలోకి వెళ్లాన‌ని తెలిపాడు.

tollywood director rajasimha as clarity to comitted suside yesterday..

దింతో అక్క‌డే స్పృహ తప్పి ప‌డిపోయాన‌న్నారు. త‌న‌ను ఎవ‌రో ఆసుప‌త్రికి తీసుకెళ్లార‌ని వాళ్లు ఎవ‌రో కూడా త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం మెరుగ్గానే ఉంద‌ని తెలిపాడు. నాకు ఇలా జ‌రిగిన విష‌యం తెలుసుకుని కంగారు ప‌డ్డ వారంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ఆసుప‌త్రి నుంచి విడుద‌లైయాక రెండు మూడు రోజుల్లోనే హైద‌రాబాద్ వ‌స్తాన‌ని తెలిపాడు. తెలుగులో ప‌లు సినిమాల‌కు రైట‌ర్ గా కూడా ప‌నిచేశాడు రాజ‌సింహ‌. సందీప్ కిష‌న్, నిత్యామిన‌న్ జంట‌గా వ‌చ్చిన ఒక్క అమ్మాయి త‌ప్ప అనే సినిమాకు ద‌ర్వ‌క‌త్వం వ‌హించాడు. ఈసినిమా అనుకున్నంతగా ఆడ‌క‌పోవ‌డంతో డ్రిపెష‌న్ లోకి వెళ్లి మ‌ళ్లి ఎక్కువ‌గా క‌నిపించ‌లేదు రాజ‌సింహ‌. దింతో ఆయ‌న‌కు టాలీవుడ్ లో ఆయ‌న‌కు ఎక్కువ‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతోనే ఇలా చేసుంటాడ‌ని టాలీవుడ్ లో పలువురు తెలిపారు.

- Advertisement -