గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన సినీ ప్రముఖులు

585
green india challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి ఇవాళ జూబ్లీహిల్స్ లోని GHMC పార్క్ లో పరుచూరి వెంకటేశ్వరరావు,తూర్పు జయప్రకాష్ రెడ్డి, జయలలిత,వినోద్ బాల,రామ్ జగన్,కాదంబరి కిరణ్,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అశోకుడు చెట్లను నాటారు అని చెప్పుకునేవారు కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం చేసి చెట్లను పెట్టారని చెప్పారని తెలిపారు.

green challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారని ఆయన చేపట్టిన కార్యక్రమంలో మూడు కోట్ల మొక్కలు నాటడం సంతోషకరమని ఇంత మంచి కార్యక్రమం లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని సూచించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకు మా యొక్క భాగస్వామ్యం ఎప్పుడూ ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -