- Advertisement -
వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వినియోగదారులు షాక్కు గురవుతున్నారు. రోజువారి సమీక్షలో భాగంగా ఇవాళ పెట్రోల్ ధరను స్ధిరంగా ఉంచిన చమురు కంపెనీలో డీజీల్పై 12 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 81.64గా ఉండగా పెట్రోల్ ధర రూ.80.43గా ఉంది.
హైదరాబాద్లో సోమవారం లీటరు పెట్రోల్ ధర రూ.83.49గా ఉండగా డీజిల్ ధర మాత్రం 16 పైసలు పెరుగుదలతో రూ.79.85కు చేరింది.అమరావతిలో పెట్రోల్ ధర రూ.83.96గా ఉండగా డీజిల్ ధర 11 పైసలు పెరుగుదలతో రూ.80.01కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖంపట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.51 శాతం తగ్గుదలతో 42.90 డాలర్లకు చేరింది.
- Advertisement -