ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

37
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇవాళ కొమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, , జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

అలాగే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. నగరవాసులకు ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఎలాంటి ఇబ్బందులు జరిగిన రెక్టిఫై చేసేందుకు డిఆర్ఎఫ్ టీమ్‌లను రెడీగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -