నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

426
kcr cm
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి గౌరవార్ధం విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ఇచ్చే విందుకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ దంపతులకు, కూతురు ఇవాంకకు కేసీఆర్ కానుకలు అందించనున్నట్టు సమాచారం.

కాగా, రాష్ట్రపతి గౌరవార్థం ఇస్తున్న ఈ విందులో మొత్తం 90 నుంచి 95 మంది వీఐపీలు మాత్రమే పాల్గొంటారని తెలుస్తోంది. కేసీఆర్ సహా మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, అసోం, హర్యానా, బీహార్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.

- Advertisement -