- Advertisement -
దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 4లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోకూడా కరోన కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 24,451 శాంపిళ్లను పరీక్షించగా మరో 439 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 7059 కేసులు నమోదయ్యాయి. ఇవాల్టీ వరకు మొత్తం 106మంది కరోనాతో మృతి చెందారు. కాగా ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించారు. మూడు జిల్లాల్లో కేసులు ఎక్కువగా వస్తుండటంతో లాక్ డౌన్ అమలు చేసినట్లు చెప్పారు అధికారులు. లాక్ డౌన్ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -