పీఆర్సీతో 50 లక్షల కుటుంబాల్లో వెలుగులు..

245
Mamilla Rajendar
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ అస్సాంబ్లీలో ప్రకటించిన పిఆర్సీ వల్ల 50లక్షల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపరని తెలంగాణ ఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. 30శాతం ఫిట్మెంట్ తో పిఆర్సీ,వయోపరిమితి పెంపుపై హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు నాంపల్లిలోని టీఎన్జీఓస్ భవన్ ముందు భారీగా బాణసంచాలు కలుస్తూ,మిఠాయిలు పంచుకుంటూ,నృత్యాలు చేస్తూ…ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు.

32నెలలుగా ఎదురు చూస్తున్న 11వ వేతరణ సవరణ సంఘం ఫలాలను అసంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పై రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 9లక్షల 17వేల 4వందల 79మంది ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక, కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్,పోలీసులు ఎవరు ఇబ్బంది పడకుండా అందరికి కడుపు నింపే విధంగా 30శాతం పిఆర్సీ ప్రకటించారని తెలిపారు.ఈ పీఆర్సీని ఉద్యోగులకు అంకితం ఇస్తున్నట్లు రాజేందర్ స్పష్టం చేశారు

- Advertisement -