టీ న్యూస్ ఎడ్యుకేషన్‌ ఫెయిర్..గ్రాండ్ సక్సెస్

32
- Advertisement -

టీ న్యూస్ ఆద్వర్యంలో హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ 2023ఫెయిర్.. విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో చివరి రోజైన అదివారం రోజు పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు ఫెయిర్ కు హాజరై కాలేజీలో సమాచారాన్ని తెలుసుకున్నారు.విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవంతంగా ముగిసింది మూడు రోజుల పాటు జరిగిన ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో వేలాదిమంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చి తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ పేరు సందర్శించి తమ కావాల్సిన కాలేజీలో సమాచారాన్ని మరియు గ్రూపుల సమాచారాన్ని తెలుసుకున్నారు.

ప్రధానంగా ఇంజనీరింగ్ కోర్సులతో పాటు అన్ని కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించటం జరిగింది .. ఇంజనీరింగ్ విద్యలో కమ్యూనికేషన్ స్కిల్స్.. ప్లేస్మెంట్ అవకాశాల తో పాటు కాలేజీలో ఎంపిక కోర్సులు ఎంపికపై ప్రొఫెసర్ డాక్టర్ మహిపతి శ్రీనివాసరావు గారు ప్రత్యేక కార్యక్రమం ద్వారా విద్యార్థుల సందేహాలు నివృత్తి చేశారు.ప్రధానంగా వెబ్ కౌన్సెలింగ్ లో విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఉన్న డౌట్స్ అన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మాక్ ‌వెబ్ కౌన్సిలింగ్ లో నివృత్తి చేసుకున్నారు అటు చివరి రోజు వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియపై ప్రొఫెసర్ డాక్టర్ రాజు.. వివరించారు.ప్రముఖ వ్యక్తిత్వాన్ని వికాసాన్నికులు సుధీర్ సండ్ర గారు విద్యార్థులకు నాలుగేళ్లలో కెరియర్ ఎలా మలుచుకోవాలో కోర్స్ ఏదైనా ఏ విధంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలో తన మోటివేషన్ ద్వారా విద్యార్థులను తల్లిదండ్రులను మోటివేట్ చేశారు.తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు తమకు కావాల్సిన సమాచారాన్నంతా ఒకే చోట సేకరించి ఒక గొప్ప అవకాశం కల్పించిన టీ న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపారు.

 

అటు కాలేజీ యాజమాన్యాలు సంతృప్తి వ్యక్తం చేశారు మూడు రోజుల పాటు జరిగిన ఎడ్యుకేషన్ ఫెయిర్ లో… తమ తమ కాలేజీ యొక్క సమాచారం ఇవ్వడంతో పాటు విద్యార్థి ఏ బ్రాంచి ఎంపిక చేసుకుంటుందో భవిష్యత్తులో ఎటువంటి కోర్సులకు డిమాండ్ ఉంటుందో తెలియజేశామని కాలేజీ ఫ్యాకల్టీ అన్నారు. అటు ఎడ్యుకేషన్ ఫెయిర్ ను విజయవంతం చేసిన కాలేజీ యాజమాన్యాలకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు టీ న్యూస్ సీజీఎం ఉపేందర్ గారు కృతజ్ఞతలు తెలిపారు.

ఎడ్యుకేషన్ ఫెయిర్ లో పాల్గొన్న కాలేజి యాజమాన్యాలకు టీ న్యూస్ ఉపేంద్ర గారి చేతుల మీదుగా మెమెంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో , టీన్యూస్‌ సీజీఎం ఉపేందర్ గారు,, టీన్యూస్‌ డీజీఎం కిరణ్‌, మార్కెటింగ్‌ టీం సత్యపాల్‌ శ్రీనివాస్‌, ఉదయ్ భాస్కర్‌, వెంకట్‌రెడ్డి, సతీష్‌, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కళాశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.గోల్డెన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌- 2023కు ప్లాటినం స్పాన్సర్‌గా మర్రి లక్ష్మణ్‌రెడ్డి విద్యా సంస్థలు, డైమండ్‌ స్పాన్సర్‌గా సీఎంఆర్‌ విద్యా సంస్థలు, గోల్డ్‌ స్పాన్సర్‌గా విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవహరించాయి.

Also Read:మట్టి కుండలో నీళ్ళు తాగితే.. ఎన్ని లాభాలో!

- Advertisement -