తిరుపతికి విమానంలో వెళ్దాం..

261
Tirupati Package from Hyderabad by Telangana Tourism
- Advertisement -

‘‘విమానంలో ప్రయాణం.. ఒక్క రోజులో ఏడుకొండల వాడి దర్శనం.. త్రీస్టార్‌ హోటళ్లలో వసతి, భోజనం.. కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తిని కలుపుతూ యాత్ర’’.. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించిన ‘తిరుపతి టూర్‌’ ప్రత్యేకతలివి. టూరిజం శాఖ స్పైస్‌ జెట్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. సేవలను ఈ నెల ఐదున లాంఛనంగా ప్రారంభించింది. ఇందులో రెండు ప్యాకేజీలున్నాయి. ఒక రోజు ప్యాకేజీ విలువ రూ.9,999. రెండు రోజుల ప్యాకేజీ ధర రూ.12,999. టికెట్లు టూరిజం శాఖ కార్యాలయాల్లో బుక్‌ చేసుకోవచ్చు. వారం రోజుల్లో ఆన్‌లైన్‌లో బుకింగ్‌ సౌకర్యం కల్పించనున్నారు.

Tirupati Package from Hyderabad by Telangana Tourism
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉదయం 6:55 గంటలకు గగనతల యాత్ర మొదలవుతుంది. ఉదయం 8:10గంటలకి తిరుపతికి, 9:30లోపు తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి దర్శనం, తిరుచానూరు అమ్మవారి దర్శనం తర్వాత సాయం త్రం 5:30కు తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి. రాత్రి 7:45కు హైదరాబాద్‌ వస్తారు. రెండు రోజుల ప్యాకేజీలో ఉద యం 9:25కి హైదరాబాద్‌లో ప్రయాణం మొదలవుతుంది. అదే రోజు శ్రీకాళహస్తి, కాణిపాకం సందర్శన, మరుసటి రోజు శ్రీవారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటా యి. సాయంత్రం 6:35కు తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి రాత్రి 7:45కు హైదరాబాద్‌ చేరుకుంటారు.

టికెట్లు బుక్‌ చేసుకోవాలనుకునే వారు సెంట్రల్‌ రిజర్వేషన్‌ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌:9848540371, 040- 29801039, ట్యాంక్‌బండ్‌-9848125720, పర్యాటక భవన్‌- 9848306435, శిల్పారామం- 9666578880, కూకట్‌పల్లి- 9848540374, సికింద్రాబాద్‌ యాత్రి నివాస్‌- 9848126947, వరంగల్‌-08702562236, నిజామాబాద్‌ 08462224403లను సంప్రదించవచ్చు.

Tirupati Package from Hyderabad by Telangana Tourism

- Advertisement -