తిరుమల అప్‌డేట్..

39
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం కలుగుతుందని అధికారులు తెలిపారు. కానుకల ద్వారా హుండి ఆదాయం రూ.3.37 కోట్లు రాగా నిన్న స్వామివారిని 70,413 మంది భక్తులు దర్శించుకున్నారు.

ఇక ఫిబ్రవరి 11 నుంచి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 10న శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుండగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.11న ఉదయం ధ్వజారోహణం(మీనలగ్నం) హంస వాహనం, 12న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం,13న భూత వాహనం, సింహ వాహనం, 14 మకర వాహనం,శేష వాహనం సేవలు నిర్వహించనున్నారు.

15 న తిరుచ్చి ఉత్సవం, అధికారనంది వాహనం 16న వ్యాఘ్ర వాహనం,గజ వాహనం, 17 న కల్పవృక్ష వాహనం,అశ్వ వాహనం,18న రథోత్సవం (భోగితేరు),నందివాహనం సేవలు కొనసాగనున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -