ఇవాళ సాయంత్రం నుంచి ఆలయాలు మూసివేత

405
Tirumala Temple Closed
- Advertisement -

చంద్రగ్రహణం కారణంగా ఇవాళ సాయంత్రం నుంచి ఆలయాలను మూసివేయనున్నారు. ఇవాళ సాయంత్రం ఏడు గంటల నుంచి రేపు ఉదయం 5గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. నేటి అర్ధరాత్రి దాటాక 1:31 నుంచి 4:29 గంటల వరకు చంద్రగ్రహణ ఘడియలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రేపు ఉదయం 5 గంటలకు శ్రీవారికి సుప్రభాతం సేవతో ఆలయ తలుపులు తెరచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభిస్తారు. మరోవైపు, చంద్రగ్రహణం కారణంగా నేటి సాయంత్రం నుంచి పలు ఆలయాలు మూతపడనున్నాయి.

తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సాయంత్రం ఆరుగంటలకు మూసివేయనున్నారు. భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయాలు కూడా మూసివేయనున్నారు. రేపు ఉదయం ఆలయాలను తెరిచి సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

- Advertisement -