గుండెల్లో గులాబీ…టైమ్స్ నౌ సర్వే

316
kcr trs
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మీడియా సంస్థల అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు సర్వేలు తెలంగాణలో టీఆర్ఎస్‌,ఏపీలో వైసీపీ తిరుగలేని ఆధిక్యంతో విజయాన్ని సాధిస్తాయని స్పష్టం చేయగా తాజాగా టైమ్స్ నౌ సర్వేలో కూడా అదే విషయం వెల్లడైంది.

తెలంగాణలో టీఆర్ఎస్ మెజార్టీ స్ధానాలను దక్కించుకుంటుందని సర్వేలో వెల్లడైంది. 41.20 ఓట్ల శాతంతో టీఆర్ఎస్ 13 లోక్ సభ స్ధానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే స్పష్టం చేసింది. ఇక బీజేపీ 2,కాంగ్రెస్ 1,ఎంఐఎం 1 స్ధానాన్ని గెలుచుకుంటుందని తెలిపింది.

ఇక ఏపీ విషయానికొస్తే ఏపీలో వైసీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుందని తెలిపింది. మొత్తం 25 సీట్లకుగాను జగన్ పార్టీకి 22 సీట్లో గెలుస్తుందని చెప్పగా టీడీపీ కేవలం 3 సీట్లకు పరిమితం అవుతుందని సర్వేలో వెల్లడించింది. వైసీపీకి 49.5 శాతం మంది ఓటర్లు, టీడీపీకి 38.40 శాతం ఓటర్లు మద్దతు పలుకుతున్నారని వెల్లడించింది.

బీజేపీ,కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ రాకపోతే టీఆర్ఎస్,వైసీపీ కేంద్రంలో కీలకమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

- Advertisement -