హైదరాబాద్ రంజీ కెప్టెన్గా నియమితులయ్యారు తిలక్ వర్మ. ఢిల్లీతో అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యే రంజీ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సెలక్షన్ కమిటీ బుధవారం 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నారు. వైస్ కెప్టెన్సీ బాధ్యతలకు రాహుల్ సింగ్ ఎంపికయ్యాడు.
హైదరాబాద్ రంజీ జట్టు
తిలక్ వర్మ(కెప్టెన్), రాహుల్ సింగ్(వైస్ కెప్టెన్), సి.వి. మిలింద్, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరథ్ రెడ్డి, హిమతేజ, వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, శరణు నిశాంత్, పున్నయ్య, అనికేత్ రెడ్డి, కార్తికేయ కాక్, అలీ కాచి డైమండ్ (వికెట్ కీపర్), రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్).
స్టాండ్బై ఆటగాళ్లు ..
పి. నితీష్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, నితేష్ కనాలా, మిఖిల్ జైస్వాల్.
Also Read:హరీష్ రావు..హౌస్ అరెస్ట్

