భారత్ కు టిక్ టాక్ భారీ సాయం..

359
tik tok
- Advertisement -

కరోనా పై పోరుకు పారిశ్రామిక దిగ్గజాలే కాదు దిగ్గజ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన టిక్ టాక్ కంపెనీ భారత్‌కు అండగా నిలిచింది.

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తనవంతు సాయాన్ని అందించింది. రూ. 100 కోట్ల విలువైన నాలుగు ల‌క్ష‌ల‌ హ‌జ్మ‌త్ సూట్ల‌ను క‌రోనా బాధితుల‌కు వైద్యం అందిస్తున్న వైద్య బృందాల‌కు అందించ‌నుంది.

తొలి విడతగా 26 వేలకు పైగా సూట్లను భారత్‌కు పంపించిన టిక్ టాక్ మ‌రో విడ‌త‌లో ల‌క్ష‌కు పైగా సూట్ల‌ను పంపించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రెండు వారాల్లో ద‌శ‌ల వారిగా అందిస్తామ‌ని టిక్‌టాక్ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -