వెంకీ అట్లూరి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తొలి ప్రేమ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈరోజు ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చిత్రటీమ్. అందమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 10న రిలీజ్కి రెడీ అయింది. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, ఇందులో .. మన జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వచ్చిన ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎన్నటికి మరచిపోలేం అనే డైలాగ్ అందరి మనస్సులకి హత్తుకుంది.
ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ట్రైలర్లోని ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా ఉండగా, తొలి ప్రేమ మూవీ ప్రేక్షకులని తప్పక అలరించనున్నట్టు ట్రైలర్ని బట్టి అర్ధమవుతుంది. రాశీ ఖన్నా చిత్రంలో కథానాయికగా నటించగా, ధమన్ చిత్రానికి సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివియస్ ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే.