ఈ వారం ఓటీటీ సినిమాలివే!

109
ott
- Advertisement -

కరోనా, లాక్ డౌన్ తర్వాత ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఓటీటీల్లో విడుదలైన సినిమాలకు మంచి రెస్పాన్స్‌ వస్తుండగా ఇక ఈ వారం కూడా ఓటీటీలో పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

నోయేల్, నందిని రాయ్, సాయ్ రోనక్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం పంచతంత్ర కథలు. ఆహాలో 31న సినిమా ప్రేక్షకుల ముందుకురాగా అగ్ర కులం అమ్మాయి, తక్కువ కులం అబ్బాయి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ కులాల కారణంగా పెళ్లి చేసుకోలేకపోతారు. ఒక స్త్రీ తన కొడుకుని చూసుకోవడానికి వ్యభిచారం చేస్తుంటుంది. ఓ వ్యక్తిని కలుసుకున్న తర్వాత ఆమె జీవితం మారిపోతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం ప్రేమించిన వాడిని వదిలేసి ఓ ధనవంతుడిని పెళ్లి చేసుకుంటుంది ఇలాంటి ఐదు విభిన్న కథల సంకలనమే ఈ పంచతంత్ర కథలు.

ఓ అందమైన అమ్మాయి, తన అక్క వివాహాన్ని ఎలాగైనా ఆపాలని అనుకుంటుంది. అందుకే బామ్మతో కలిసి ఓ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. వారి మధ్య జరిగే సరదా సన్నివేశాల సమాహారమే ‘పెళ్లికూతురు పార్టీ’. ఆగస్టు 31న ఆహా వీడియోలో విడుదలైంది.

- Advertisement -