జంతువుల నూనెతో తిరుపతి లడ్డూ..చంద్రబాబు సంచలనం!

1
- Advertisement -

తిరుమల లడ్డూపై సంచలన కామెంట్స్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు..గత పాలకులు తిరుమల లడ్డూను అపవిత్రం చేశారన్నారు. నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసిందని..ఈ విషయం తెలిసి ఆందోళన చెందానన్నారు. మేం అధికారంలోకి వచ్చాక స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం అన్నారు.

గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల పవిత్రతను కళంకం చేశారు అన్నారు. ఉచిత భోజన నాణ్యతపై రాజీపడి, నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును ఉపయోగించడం ద్వారా పవిత్ర తిరుమల లడ్డు కూడా కలుషితం చేశారు అన్నారు.

ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగిస్తున్నాము. టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తున్నాం అని బాబు అన్నారు.

Also Read:యాదాద్రి గర్బగుడికి స్వర్ణతాపడం:కొండా

- Advertisement -