వైద్య వృత్తికి సమాజంలో విశిష్ట స్థానముంది-మంత్రి కొప్పుల

184
- Advertisement -

వ్యాపార దృష్టి కాకుండా సేవా దృక్పథంతో ముందుకు సాగే వైద్యులను సమాజం దేవుడి మాదిరిగా గౌరవిస్తుందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.వైద్య శిరోమణి,సేవారత్న పేరిట వివిధ అంశాలలో నిష్ణాతులైన డాక్టర్లకు మెగాసిటీ నవ కళావేదిక పురస్కారాలను ప్రధానం చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న రోగి ప్రాణాలు కాపాడిన డాక్టర్ ను మనం ఎంతగానో గౌరవిస్తామన్నారు. వైద్యవృత్తికి గొప్ప విలువ ఉందని,సమాజం పట్ల బాధ్యత కలిగి సేవా దృక్పథం కలిగి ఉండే వారికి ఇటువంటి పురస్కారాలు, సత్కారాలు లభిస్తాయన్నారు.

ఈ సందర్భంగా బిసి కమిషన్ మాజీ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ,వైద్యో నారాయణ హరి అంటే.. డాక్టర్ భగవంతుడితో సమానమని అర్థమన్నారు.కార్యక్రమానికి సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ అధ్యక్షత వహించగా, వేదిక వ్యవస్థాపకులు మల్లికార్జున్ రావు, డాక్టర్ ఆశీస్ చౌహాన్,కె.శ్రీనివాసచారి,రాఘవ సాయినాథ్,ఆర్.సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా 23డాక్టర్లకు పురస్కారాలు అందజేసి సత్కరించారు.నిర్వాహకులు మంత్రిని శాలువాతో సన్మానించారు.

- Advertisement -