ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

353
congress first list
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు ఎన్నికల తొలి జాబితా అభ్యర్ధులను ప్రకటించింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నెల రోజుల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. టీపీసీసీ మొదటి విడత అభ్యర్థుల జాబితాలో 36 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్టులో పార్టీలోని సీనియర్లు, తాజా మాజీ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితా ఇది.

 Telangana-Congress-Party

పరిగి-రామ్మోహన్‌రెడ్డి, హుజూర్‌నగర్‌-ఉత్తమ్‌, నాగార్జునసాగర్‌-జానారెడ్డి, ఆలేరు-భిక్షమయ్యగౌడ్‌, నల్గొండ-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నకిరేకల్‌-చిరుమర్తి లింగయ్య, జహీరాబాద్‌-గీతారెడ్డి, ఆంధోల్‌- దామోదర రాజనర్సింహ్మ, నర్సాపూర్‌-సునీత లక్ష్మారెడ్డి, కొడంగల్‌-రేవంత్‌రెడ్డి, వనపర్తి-చిన్నారెడ్డి, కల్వకుర్తి-వంశీచంద్‌రెడ్డి, అలంపూర్‌-సంపత్‌కుమార్‌, నాగర్‌కర్నూల్‌-నాగం, మధిర-భట్టి విక్రమార్క, గోషామహల్‌-ముఖేష్‌గౌడ్‌, సనత్‌నగర్‌-మర్రిశశిధర్‌రెడ్డి, నాంపల్లి-ఫిరోజ్‌ఖాన్‌, వికారాబాద్‌-ప్రసాద్‌ కుమార్‌, నర్సంపేట-మాధవరెడ్డి, జనగాం-పొన్నాల లక్ష్మయ్య, తుంగతూర్తి-అద్దంకి దయాకర్‌, మహేశ్వరం-సబితా ఇంద్రారెడ్డి, సంగారెడ్డి-జగ్గారెడ్డి, గజ్వేల్‌-ప్రతాప్‌రెడ్డి, జగిత్యాల-జీవన్‌రెడ్డి, మంథని-శ్రీధర్‌బాబు, కరీంనగర్‌-పొన్నం ప్రభాకర్‌, సిరిసిల్ల-కేకే మహేందర్‌రెడ్డి, గద్వాల-డీకే అరుణ, షాద్‌నగర్‌-ప్రతాప్‌రెడ్డి, కామారెడ్డి-షబ్బీర్‌అలీ, ఖానాపూర్‌-రమేష్‌ రాథోడ్‌, ఆసిఫాబాద్‌-ఆత్రం సక్కు, భూపాలపల్లి-గండ్ర వెంకట రమణారెడ్డి, బోధన్‌-సుదర్శన్‌రెడ్డిలు పోటీ చేయనున్నారు.

- Advertisement -