జీ5లో బంగర్రాజు..!

54
nag
- Advertisement -

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు.

తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను జీ5 భారీ ధరకు కొనుగోలు చేయగా ఫిబ్రవరి 18న ZEE5లో డిజిటల్‌లో ప్రసారం కానుంది. OTT ప్లాట్‌ఫాం అదే విషయాన్ని ప్రకటించడానికి అధికారిక ప్రోమోను విడుదల చేసింది. అనూప్ రూబెన్స్ సంగీతం, యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు.

- Advertisement -