కడియంకు సవాల్ విసిరిన రాజయ్య..

17
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మండిపడ్డారు తాటికొండ రాజయ్య. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో రాజ‌య్య మాట్లాడుతూ…కడియంకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే ఘ‌న్‌పూర్‌లో నువ్వా.. నేనా చూసుకుందాం అని క‌డియంకు స‌వాల్ విసిరారు. అంతిమ పోరాటం మ‌న ఇద్ద‌రి మ‌ధ్య‌నే అని స్ప‌ష్టం చేశారు. మ‌న ఇద్ద‌రి మ‌ధ్య పోరాటం కోసం ఒక్క తెలంగాణ‌నే కాదు దేశం మొత్తం ఎదురుచూస్తోంద‌ని రాజ‌య్య తెలిపారు.

క‌డియం శ్రీహ‌రికి సిగ్గు, శరం, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో నువ్వా నేనా చూసుకుందాం అని స‌వాల్ విసిరారు.

Also Read:ఎక్కువసార్లు టీ తాగితే..ఆ లోపం వస్తుందా!

- Advertisement -