‘అన్నపూర్ణ క్యాంటీన్’‌కు ఆరేళ్లు- కేటీఆర్ ట్వీట్

458
Thanks to Akshaya Patra hard working staff says ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ‘అన్నపూర్ణ క్యాంటీన్లు’ప్రారంభించి ఆరేళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. పేదల ఆకలి తీరుస్తున్న తెలంగాణ అక్షయపాత్రకు కృతజ్ఞతలు అంటు కేటీఆర్ తెలిపారు. ఈ క్యాంటీన్లు ప్రతిరోజు వేలాదిమంది ఆకలిని తీరుస్తున్నాయి. హైదరాబాద్‌ పరిధిలో సుమారు 150 అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయి. మధ్యాహ్నం, రాత్రి ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనం పెడుతున్నారు. అంతేకాదు, కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందిస్తున్నారు.

‘జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఆరేళ్ల క్రితం ప్రారంభించాం. దాదాపు 5.5 కోట్ల మీల్స్‌ను ఈ క్యాంటీన్లు అందించాయి. తెలంగాణ కరోనాపై పోరాడుతున్న నేపథ్యంలో ఈ క్యాంటీన్లు 65 లక్షల మందికిపైగా ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందజేశాయి. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయలేని అతిపెద్ద కార్యక్రమం ఇది. అక్షయపాత్రకు, కష్టపడి పనిచేస్తోన్న సిబ్బందికి ధన్యవాదాలు’ అని కేటీఆర్‌ తెలిపారు.

- Advertisement -